కళ్ళికోట కథాకేళి  

Posted by దైవానిక in

గమనిక: ఈ కథలో పాత్రలు సంఘటనలు కేవలం కల్పితాలు. ఎవరిని ఉద్దేశించినవి కావు. ఎవరికయినా ఉద్దేశించినట్లనిపిస్తె వాడె రెనా.

స్థలం: కళ్ళికోట ఇంజినీరింగ్ కళాశాల
సమయం: మొదటి సంవత్సరం, రాగింగ్ సమయం

రాజు తనకు సీనియర్లు చెప్పిన విషయం అందరికి చెప్పడానికి సమావేశం ఏర్పాటు చేసాడు. ఆందరూ వచ్చాక విషయం చెప్పాడు. వచ్చె ఆదివారం తెలుగు అసొసియేషన్ వార్షిక సమావేశాలు. కనుక మొదటి సంవత్సరం విధ్యార్థులు ఒక నాటిక ప్రదర్శించడం ఆనవాయితి. అక్కడ కళ్ళికోటలో వున్న చాలా మంది కుటుంబీకులు ఆ సమావేశాలకు వస్తారు. కనుక బూతులు లేకుండా మంచి నాటిక వెయ్యమన్నారు. బాగోకపోతే పగిలిపోద్దన్నారు. twist ఏంటంటే పద్నాలుగు మంది వుండాలి ఆ నాటకంలో. అందరు మోహాలు మాడిపోయాయి. అసలే సీనియర్లు చండశాసనులు. తేడా వస్తె కుమ్మేస్తారు. ఇప్పుడు 14 మంది వున్న నాటకం ఎక్కడ దొరుకుతుంది అని కొందరు సామాన్యులు వాపోయారు.
ఎవరి పేరు చెప్తె బండ బూతులు తిట్టాలనిపిస్తుందో, ఎవరు పేరు చెబితె సీనియర్లకు కొట్టాలనిపిస్తదో, వాడి పేరు రేనా ( caption :వాడిది రాయలసీమ కాదు). కాని లారి జనాన్ని దించి సీనియర్లను ఏసేద్దమని చూసాడు. సామాన్యుల ప్రార్థన మీద ప్రయత్నం విరమించి శాంతించాడు. ఇక అసలు విషయానికి వస్తె, రేనా విషయం విన్నాక, కెవ్వున అరిచాడు. ఆ దెబ్బకి అప్పుడే నిద్రలోకి జారుతున్న విష్ణు శాస్త్రి ఉలిక్కి పడి లేచాడు. అందరి మొహాలు పేలవంగా ఉండటం చూసి విషయం కనుక్కున్నాడు. అదేంటో సమావేశం లో " స" వినగానే గురక శబ్దం వినిపిస్తుంది అందరికి. ఎందుకు అరిచాడో ఎవరు అడగకపోయె సరికి, తనే మనసులో మాట చెప్పాడు రెనా. తనే ఒక నాటిక వ్రాస్తానన్నాడు.

సామాన్యుడు 1: ఏరా నువ్వు నాటకాలు కూడా వ్రాస్తావా?
రెనా: అదేమయిన బ్రహ్మ విద్యా. సరిగ్గా నాలుగు గంటలు కూర్చుంటే అయిపోద్ది. నాకు రేపొద్దున్న దాకా టైం ఇవ్వండి. ఒక కత్తిలాంటి నాటిక తయారు చెస్తాను.
సామాన్యుడు 1: ఉరేయ్, 14 మంది ఉండాలి చూసుకో.

ఇక చేసేది లేక అందరు రేనా నాటిక కోసం తెల్లవారు కలుద్దామని బయలుదేరారు. గాండ్రిస్తున్న విష్ణుని లేపి గదికి పంపారు.
రెనా కనీసం పేపర్ కూడ లేకుండా వచ్చాడు తరువాత రోజు.

రాజు: ఉరేయ్, నాకు చాలా Tension గా ఉంది. నాటిక తలుచుకుంటేనె వణుకేస్తుంది. ఇంతకి నాటిక ఎక్కడ?
రెన: why fear? i am here. నాటిక అంతా నా బుర్రలో ఉంది. అందరూ రాగానే బయటకు లాగుతా. విష్ణుకి వినిపించా.. సూపర్ అన్నాడు.
రాజు. వాడు మెలుకువగా వున్నప్పుడె చెప్పవా??

అందరూ వచ్చారు. రెనా మెల్లగా గొంతు సవరించుకున్నాడు. ఇంతలో సన్నగా గురక శబ్దం వినిపించింది. సమావేశం మొదలుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే..
నాటిక మొదలుపెట్టమని రెనా వైపు చూస్తున్నారు అందరు. రెనా మొదలెట్టపోతుండగా

సామాన్యుడు 2: ఏర ఇది మొదటి సీనా?
రెనా: లేదు మామ ఎక్కడైనా పెట్టొచ్చు.
సామాన్యుడు 2: ఆ! ( షాకుతో ఫిట్సొచ్చినట్టున్నాయి)
ఇక సీనులోకి వెళితె, ఒక టీ కొట్టు. ఒకడు టీని రెండు గ్లాసుల్లొకి తిరగబోస్తున్నాడు. ఒకడు టీ తాగుతున్నాడు, ఒకడు ఊరికే నడుస్తూ ఉన్నాడు.

సామాన్యుడు 3: ఆ తరువాత?
రెనా: కాస్త డమ్మి.
సామాన్యుడు 3: అంటె?
రెనా: అంటె అక్కడ కాస్త డమ్మిగా ఎదైనా వేద్దాము.
సామాన్యుడు 3: ఏమి వేద్దాము?
రెనా: అంతా నిక్కచ్చిగా ఆలోచించలేదు.
సామాన్యుడు 3: (మెల్లగా మూలుగుతూ) తర్వాత?

రెనా: వాళ్ళు వెళ్ళిపోతారు.
సామన్యుడు 4: అంటె మళ్ళి రారా?
రెనా: మళ్ళా ఎందుకు?
సామాన్యుడు 4: వాళ్ళకి డైలాగులు లేవా?
అయితె అందులో ఒక పాత్ర నాకు కావాలి అని రాజు గట్టిగా అరిచాడు. మళ్ళి విష్ణుకి మెలుకువ వచ్చింది.
రెనా: డమ్మి కలిపినప్పుడు డైలాగులు కూడ కలుపుదాము లే మామ.
సామాన్యుడు 4: (మూడొ వికేట్ ఫట్)

సామాన్యుడు 5: ఇట్లా ఇంకా ఎన్ని సీన్లున్నాయి?
రెనా: ఇంక 5 వున్నాయి.
సామాన్యుడు 5: ఎవరికైనా డైలాగులున్నాయా?
రెనా: అంతా డమ్మి.

(సమాప్తం)

అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి......  

Posted by దైవానిక in

అనగనగా ఒక ఊరిలో ఒక రామచంద్రయ్య. భోజన ప్రియుడు. బుట్టెడు అరిసెలు తినటానికి పట్టెడు నిమిషాలు కూడా పట్టదు అతనికి. అతని ధర్మపత్ని విజయలక్ష్మి. మహా ఇల్లాలు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలో వాణిశ్రీ లాగా తయారు అవ్వాలనుకుంటది. భొజనం వండడం, ఇల్లు సర్దడం లాంటి చిన్న చిన్న పనులు మీద పెద్దగా ఆసక్తి చూపడానికి ఇష్టపడదు. కాని రెక్కాడితే కాని డొక్కాడని సంసారం మరి.

వీరికి ఒక శుభదినం పేపర్లో ఒక వార్త కనపడ్డది. అరవయ్యేళ్ళు నిండిన ఒకాయన కోట్లు సంపాదిస్తున్నాడట. పుస్తకాలు, కథలు వ్రాస్తూనే. అది చదివాక మనవాళ్ళ మనస్సులో ఏమి ఆలొచన పడ్డదో వేరే చెప్పక్కర లేదు. పట్టపగలే కలలు మొదలయినాయి. ఒక పెద్ద గది, గదికి సరిపడినంత డైనింగ్ టేబుల్. టేబుల్ మీద ఖాళీ దొరకనన్ని వంటకాలు. ఆహ! కాస్కొ నా రాజా! పక్కనే ఇంకొక గది. దానిలో రెండు పెద్ద పెద్ద బీరువాలు. ఒక దానిలో నగలు, ఇంకొక దానిలో చీరలు. అలా చూస్తూ కళ్ళు, కళ్ళు కలిసాయి. కలిసి వర్తమానంలోకి నడిసాయి. పొయ్యిమీద ఎదో మాడుతున్న వాసన. చక్కున విజయ వంటింటి వైపు పరిగుతీసింది. "ఖర్మరా నాయనా! మళ్ళీ మాడు కూడె . ఆ కథలేవో వ్రాసేసి, ఆ కోట్లు సంపాదిస్తె మంచి చేయి తిరిగిన ఒక వంటలక్కని పనిలో పెట్టుకొని కావలసినవి చేయించుకోవాలిరా బాబు" అనుకున్నాడు. వంటింట్లో విజయ కూడా ఆ కోట్లు వస్తె ఈ పాడు చాకిరి తప్పుతుంది. దర్జాగా తిని కూర్చొవచ్చు అని అనుకున్నది. ఇక్కడ పాఠకులకు ఒక సామెత గుర్తువస్తూ వుండవచ్చు... ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడట.

మాడు కూర భొజనాలు అయినాక ఇద్దరు ఎవరి ఆలోచన్లు వారు చెప్పారు. కథలు సబ్జక్టు వేట మొదలెట్టారు. ఎంత ఆలోచించినా కథలు దొరకలేదు సుమీ. కథలు దొరకగపోగా రాత్రి కూరతొపాటు అన్నం కూడా మాడింది. అది చాలక ఒకరి కథని ఒకరు వెక్కిరించడం మొదలెట్టారు. కథ ఒక పంక్తి, దానికి విమర్శ పది పంక్తులు. విసిగి ఇద్దరు ఒక సంధికి వచ్చారు. ఇద్దరు కలిసి ఒకే కథ వ్రాద్దాము అని. వారి జీవితాల గురించే వ్రాద్దాము అని. ఒకరి creative space లోకి వేరొకరు వెళ్ళొద్దని. ముఖ్యముగా ఒక్కొక్కరికి 5 వాఖ్యాలు టార్గెట్. అటు తరువాత పక్కవారికి ఇచ్చెయ్యాలి.

ఆ కథ ఎలా వచ్చిందో చదివి తీరవలసిందే...

విజయ మొదలెtcట్టింది కథ, " పోద్దున్న నిద్రలేచి, తిండిపోతు మొగుడికి ఉపహారం చెయ్యడానికి వంటింట్లోకి వెళ్ళాను. అంతలో చీరల వాడి కేక వినపడ్డది. పండక్కి చీరలు కొనుక్కొమన్న ఆయన మాట గుర్తొచ్చి, మళ్ళీ కొనుక్కోకపోతే ఆయన బాధ పడతారని చీరలవాడి మూట దింపించాను. కొత్త చీరలు చాలా వున్నయి." తన 5 వాక్యాలు అయిపొయాయి అని గుర్తుచేసాడు.
"బాత్రూంలో నుంచి వచ్చే సరికి, చీరల వాడిని చూసి చిర్రేత్తుకొచ్చింది. వాడిని నాలుగు తిట్లు తిట్టి, మళ్ళి ఇంటి ఛాయల్లో కనిపిస్తే చంపుతా అని బెదిరించి పంపాను. ఆ రోజు Tiffin కింద ఉప్మా, మినపట్టు, చిల్లుగారెలు చేసింది విజయ. మధ్యాహ్నం వంటకి ఎమి చెయ్యాలి అని అడిగింది. పులిహొర, చక్రపొంగలి చెయ్యమన్నాను" విజయ పల్లు పటా పటా కొరుకుతూ తన వంతు వచ్చిందని గుర్తు చేసింది.
సరే ఆయన చెప్పిన వంటలు చేద్దాము అని వంటింట్లోకి వెళ్ళాను. తీరా చూస్తే, చింతపండు, పంచదార నిండుకున్నాయి. ఇక చేసేది లేక మామూలు వంటలు చెయ్యడానికి ఆయన కూడ ఒప్పుకున్నరు. వంటలు నచ్చి, ఎప్పుడూ నూంచో కొని పెడతానంటున్న రవ్వల నెక్లస్, కంచి పట్టుచీర ఈ వేళ సాయంత్రమే కొనిపెడతానన్నారు. డబ్బు తేవడానికి బాంకుకి కూడ వెళ్ళారు.
రామయ్య తన వంతు వచ్చిందని గొంతు సవరించి మరి చెప్పాడు. నీ సంగతి చెప్తానంటూ తను మొదలెట్టాడు. " డబ్బు తీసి, విజయని తీసుకొని కొనడానికి బయలుదేరాము. దారిలో ఒక దొంగ మమ్మల్ని బెదిరించి డబ్బు కాస్తా కాజేసి పొయాడు. విజయ ఒంటి మీద నగలు కూడా కొట్టేసాడు. విజయ ఇదంతా తనవళ్ళే జరిగిందని బాగా ఏడ్చి ఇక జన్మలో నగలు చీరలు అడగనని వేంకటేశ్వరుడు మీద ఒట్టేసింది. ఇక చేసేది లేక చింతపండు, పంచదార కొనుక్కోని ఇంటికి బయలుదేరాము"
విజయ కడుపు రగిలిపోయింది. తగిన శాస్తి చెయ్యలని మొదలెట్టింది. "ఇంటికి బయలు దేరి ఆటోలో వస్తుంటే పెద్ద accident అయ్యింది. నాకు పెద్దగా దెబ్బలు తగల్లెదు కాని, ఆయనికి బాగా తగిలాయి. ఆసుపత్రికి తీసుకెళితె అక్కడ doctor ఎవేవొ టెస్టులు చేసి ఆయనకు B.P, Sugar, ulcer వుందని తేల్చి చెప్పాడు. ఉప్పు కారం పులుపు తీపి తినకూడదని డాక్టరు గట్టిగా చెప్పాడు. ఇక ఆయన కూడ చేసేది లేక మానేస్తానని ఆ బెజవాడ కనకదుర్గ మీద ఒట్టేసాడు"

ఇక అంతే, కథ అక్కడికి చాలించి ఒకరి మీద ఒకరు రుస రుసలు మొదలు. నాలుగు రొజులు ఇద్దరికి మాటలు లేవు కూడా! ఇక మళ్ళీ కథల గురించి ఎప్పుడు ఆలొచించలేదు.


ముఖ్య గమనిక: ఈ కథ ఎప్పుడో చదివిన ఒక కథ మీద ఆధారపడి వ్రాసినది (అంటె, original కథ అసలు గుర్తు లేదు. 5 లైన్ల concept మాత్రము అక్కడ నుంచి తీసుకున్నదే. మిగతా అంతా నా కల్పితం). ఎవరు వ్రాసారు, కథ పేరు లాంటివి గుర్తు లేవు. తెలిసిన వారు చెప్పగలరు.